19న రాజ్యసభ ఎన్నికలు..18 సీట్లకు పోలింగ్
01-06-202001-06-2020 18:52:46 IST
Updated On 02-06-2020 09:36:22 ISTUpdated On 02-06-20202020-06-01T13:22:46.484Z01-06-2020 2020-06-01T13:22:34.594Z - 2020-06-02T04:06:22.411Z - 02-06-2020

దేశంలో రాజ్యసభ ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలను జూన్ 19న నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈసారి 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అధికార వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒక అభ్యర్థి బరిలో ఉన్నారు. కాగా, ఏపీలోని నాలుగు స్థానాలతో పాటు గుజరాత్ లో 4, మధ్యప్రదేశ్ లో 3, రాజస్థాన్ లో 3, ఝార్ఖండ్ లో 2, మణిపూర్ లో 1, మేఘాలయలో 1 స్థానాలకు ఎన్నికలు జరుపుతారు. ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను అనుసరిస్తూ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కరోనా కల్లోలం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. దేశ వ్యాప్తంగా 55 రాజ్యసభ సీట్ల కోసం ఫిబ్రవరి 25న ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అందులో అప్పటికే 37 సీట్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మిగిలిన 18 స్థానాలకు మార్చి 26న పోలింగ్ జరగాల్సి ఉంది. తెలంగాణలో ఖాళీ అయిన రెండు స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి. ఏపీలో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీ నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్న కే కేశవరావు, ఏకే ఖాన్, టి సుబ్బిరామిరెడ్డి, సీతారామ లక్ష్మి కాల పరమితి ముగిసింది. వీరి స్థానంలో ప్రస్తుతం ఏపీ శాసనసభలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా నాలుగు స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. అయితే, ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ సైతం అనూహ్యంగా తమ అభ్యర్దిని బరిలోకి దింపింది. వర్ల రామయ్య టీడీపీ నుండి నామినేషన్ దాఖలు చేసారు. ఇక, వైసీపీ నుండి అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్ర బోస్, పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానీ నామినేషన్లు వేసారు. సంఖ్యా పరంగా రాజ్యసభ సమావేశానికి ఎటువంటి ఇబ్బంది లేకపోవటంతో కరోనా ప్రభావం కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
3 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
35 minutes ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
6 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా