సుప్రీంకోర్టులో పిటిషన్ డిస్మిస్...నేడే ఉద్ధవ్ విశ్వాసపరీక్ష
30-11-201930-11-2019 08:52:50 IST
Updated On 30-11-2019 12:47:28 ISTUpdated On 30-11-20192019-11-30T03:22:50.219Z30-11-2019 2019-11-30T03:22:47.205Z - 2019-11-30T07:17:28.702Z - 30-11-2019

మహారాష్ట్ర రాజకీయాలు పక్షం రోజులుగా ఉత్కంఠను రేపాయి. దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడం, వెంటవెంటనే కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. గురువారం శివాజీపార్కులో ఉద్దవ్ థాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కూటమి ‘మహా వికాస్ ఆఘాడి’ ద్వారా ప్రభుత్వం ఏర్పాటైంది,. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అసెంబ్లీలో బలనిరూపణకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు డిసెంబర్ 3 వరకు గడువు ఇచ్చారు. అయితే మూడురోజులు ముందుగానే ఆయన మెజారిటీని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 30 మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశం అయింది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుండడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ను కొత్త ప్రొటెం స్పీకర్గా నియమించారు. ఫడ్నవీస్ ప్రభుత్వం నియమించిన ప్రొటెం స్పీకర్ కాళిదాసు కొలాంబ్కర్ స్థానంలో పాటిల్కు బాధ్యతలు అప్పగించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిలీప్ పాటిల్ గతంలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. మరోవైపు సుప్రీంకోర్టు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎన్నికల అనంతరం జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. వివిధ రాజకీయ పక్షాలతో పొత్తుపెట్టుకోవడం పార్టీల హక్కు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎన్నికల అనంతరం జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారించింది. రాజకీయ నైతికత, రాజ్యాంగ నైతికత వేర్వేరని, వాటిని పోల్చలేమని స్పష్టం చేసింది. ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారితో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై అఖిల భారత హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల అనంతరం జరిగే పొత్తుల్లో కోర్టును లాగవద్దని ధర్మాసనం పేర్కొంది.

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 minutes ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
an hour ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
2 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
4 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
4 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
20 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
19 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
20 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
18 hours ago

మమత ప్రచారంపై 24 గంటల బ్యాన్. ఈసీ కొరడా..
13-04-2021
ఇంకా