సీఏఏపై మోడీ సర్కార్ పట్టు... అణచివేతే మార్గమా?
18-12-201918-12-2019 09:29:58 IST
Updated On 18-12-2019 10:31:13 ISTUpdated On 18-12-20192019-12-18T03:59:58.917Z18-12-2019 2019-12-18T03:59:49.237Z - 2019-12-18T05:01:13.403Z - 18-12-2019

దేశవ్యాప్తంగా సీఏఏ పై నిరసనలు హోరెత్తుతున్నాయి. పౌరసత్వ సవరణల చట్టం అమలుపై హోంమంత్రి తమ వైఖరిని స్పష్టం చేశారు. ముస్లిమేతర శరణార్థులందరికీ పౌరసత్వం ఇచ్చి తీరతామంటున్నారు అమిత్ షా. చొరబాటుదారులకు దేశంలో చోటు ఉండకూడదన్నారు. విద్యార్ధులు వాస్తవిక దృక్పథంలో వ్యవహరించాలన్నారు. విద్యార్థులపై చర్యలు ఉండవన్నారు. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు భావ ప్రకటన స్వేచ్ఛ, ఆలోచనలను పెంపొందించే కేంద్రాలుగా మారాలని, మన దేశం, సమాజం ఎదుర్కొంటున్న కొన్ని ప్రత్యేక సమస్యలకు పరిష్కారం చూపడంలో ఉన్నత విద్యాసంస్థలే కీలకపాత్ర పోషించాలన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. పౌరసత్వ సవరణ చట్టవల్ల ఏ ఒక్క భారతీయుడి పౌరసత్వం రద్దు కాదన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రగిలిస్తున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన హాట్ టాపిక్ అవుతోంది. వివిధ రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలపై ఆయన స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టంపై వెనక్కి తగ్గేది లేదనీ, దీని అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విపక్షాలు కోరుతున్నట్లు దీనిని ఉపసంహరించుకునే ప్రశ్నే లేదన్నారు. దేశంలో ఏ ముస్లిం హక్కులనూ, పౌరసత్వాన్ని ఈ చట్టం హరించదన్నారు. భారతీయ ముస్లింలకు సంబంధించి ఎలాంటి నిబంధనలూ ఇందులో లేవన్నారు హోంమంత్రి అమిత్ షా. ఈ దేశ పౌరులు. విదేశాల్లో బాధలు పడుతున్న వేలాది మంది ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించి వారు గౌరవంగా బతికే అవకాశం కల్పిస్తుందన్నారు అమిత్ షా. ఏ ఒక్క చొరబాటుదారునూ ఉపేక్షించమని, వారిని వెళ్లగొట్టి తీరతాం అన్నారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న జామియా విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని, అల్లర్లకు, విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులపై మాత్రమే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. ఈ చట్టం వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలు లేవని, అలాంటి ఆలోచన వుంటే ఎన్నికల ముందే ఈ చట్టం తెచ్చేవారమని కాంగ్రెస్ పై మండిపడ్డారు అమిత్ షా. మరోవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ తీరుపై ఆందోళన కారులు మండిపడుతున్నారు. వివాదాస్పద పౌరసత్వ చట్టానికి జేడీయూ మద్దతు ప్రకటించడంపై ఆ రాష్ట్ర పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా తామంతా నిరసన చేపడుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. సీఎం కనిపించడం లేదంటూ వారు విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసేవారిపై ‘కనిపిస్తే కాల్చివేత’ ఆదేశాలు జారీ చేస్తామని రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి హెచ్చరించారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా