సరిహద్దులు క్లోజ్... ప్రయాణికులపై ఆంక్షలు
16-03-202016-03-2020 10:21:26 IST
2020-03-16T04:51:26.039Z16-03-2020 2020-03-16T04:51:16.658Z - - 11-04-2021

కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. విదేశీయుల రాక, వీసాల జారీపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా పొరుగుదేశాల సరిహద్దులు మూసివేస్తూ నిర్ణయం వెలువరించింది. ఇండో-బంగ్లాదేశ్, ఇండో-నేపాల్, ఇండో-భూటాన్, ఇండో-మయన్మార్ సరిహద్దుల వెంబడి అన్ని రకాల ప్రయాణికులపై నిషేదాజ్ఞలు విధిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇండో-పాక్ సరిహద్దు మూసివేత నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా నడుం బిగించింది. అమెరికా వీసాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. మార్చి 16 నుంచి అమెరికా వీసాల జారీ నిలిపివేయాలని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించిన అమెరికా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే వీసాల జారీని నిలిపివేసింది. ఇండియా కూడా విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు కొనసాగిస్తోంది. ఏప్రిల్ 15 వరకు టూరిస్ట్ వీసాలను రద్దు చేసింది. మార్చి 13వ తేదీ నుంచి టూరిస్ట్ వీసాల సస్పెన్షన్ నిర్ణయం అమలులోకి వచ్చింది. కేవలం అధికారిక పర్యటనలు, దౌత్యపరమైన వీసాలు, కొందరు వీఐపీల వీసాలకు మాత్రమే ఈ సమయంలో పర్యటించే అవకాశం ఉంది. ఇటు కరోనా వైరస్తో ఇరాన్ వణుకుతున్న వేళ అక్కడ ఇరుక్కుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పిస్తోంది. టెహరాన్, షిరాజ్ నగరాల నుంచి 53 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ నగరంలోని ఆర్మీ వెల్నెస్ సెంటరుకు తరలించారు. ఇరాన్ నుంచి వచ్చిన 52 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడికి విమానాశ్రయంలోనే వైద్యపరీక్షలు చేసి వారిని ఆర్మీ వెల్నెస్ సెంటరుకు తరలించారు. ఇరాన్ దేశం నుంచి 389 మంది భారతీయులను నాలుగు విడతలుగా స్వదేశానికి తరలించామని, దీనికి సహకరించిన ఇరాన్ దేశ అధికారులకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అక్కడ ఆలయాల్లోకి నో ఎంట్రీ జ్వరంతో బాధపడేవారికి తమిళనాడులోని కొన్ని ఆలయాల్లోకి ప్రవేశాన్ని నిషేధించారు. శ్రీరంగం రంగనాథర్స్వామి ఆలయ అధికా రులు, ఆరోగ్యశాఖ సిబ్బంది సంయుక్తంగా ఆలయానికి వచ్చే భక్తులకు థర్మల్ స్కానర్ తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. . 99 డిగ్రీ జ్వరంతో ఉండే భక్తులకు ప్రత్యేక వైద్యచికిత్స అందిస్తున్నామన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు చేతులను శుభ్రపరచు కొనే ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న భక్తులు ఆల యానికి రావొద్దని ఆయన సూచించారు. భక్తులు తమకు సహకరించాలని కోరారు. ఎక్కువమంది ఒకేచోట గుమిగూడి వుండవవద్దన్నారు. ఇటు ఏపీలోని తిరుమల ఆలయంలో భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తిరుమలకు భక్తుల తాకిడి తగ్గింది. ఇటు చిత్తూరు జిల్లాలో కరోనా కలకలం రేపింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం అనిమిగానిపల్లిలో కరోనా లక్షణాలు కొందరికి ఉన్నాయని తెలియడంతో జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది. కుప్పంలో అనిమిగానిపల్లి గ్రామంలో సుమారు మూడు వందలమంది దాక జాతకాలు చెప్పడానికి ప్రతి ఏటా మలేషియా దేశానికి వెళతారు. ఆరు నెలలకు ఒకసారి సొంత గ్రామానికి వచ్చి వెళ్తుంటారు.ఈ క్రమంలో గత పదిరోజులలో పన్నెండు మంది సొంత గ్రామానికి చేరుకున్నారు. మలేషియా నుండి వచ్చినవారిలో ఇద్దరికి దగ్గు గొంతునొప్పి రావడంతో స్థానిక వైద్య సిబ్బందికి గ్రామస్థులు సమాచారం ఇచ్చారు.అయితే వైద్యపరీక్షలకు వారు నిరాకరించడంతో గ్రామస్థులు నచ్చచెప్పి వైద్య పరీక్షలు చేయడానికి బెంగుళూరు నుండి స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపించారు. మరో 15 మంది మలేషియా నుండి అనిమిగానిపల్లి గ్రామానికి రానుండడంతో వారికి పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
14 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
11 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
13 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
17 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
20 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
21 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా