రాహుల్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలంటే.. పాదయాత్రలే శరణ్యం..
03-08-202003-08-2020 08:19:48 IST
2020-08-03T02:49:48.496Z03-08-2020 2020-08-03T02:49:45.478Z - - 22-04-2021

కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీపై ఆపార్టీలోని వృద్ధ జంబూకం దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం లేపాయి. ఇప్పటికే పార్టీ పతనానికి డిగ్గీరాజా వంటి సీనియర్ నేతలే కారణమని మండిపడుతున్న కాంగ్రెస్ యువశ్రేణులు డిగ్గీ తాజా ప్రకటనపై భగ్గుమన్నారు. మధ్యప్రదేశ్లో పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా నిష్ర్కమణకు దిగ్విజయ్ సింగ్తో పాటు కమల్నాథ్లు కారణమని వారు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్గా రాహుల్ గాంధీ తిరిగి పార్టీపగ్గాలు చేపట్టాలని సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నేతలు కోరారు. రాహుల్ని పార్టీ సారథిగా చూడాలనుకుంటున్నామని నేతలు పేర్కొన్నారు.
రాహుల్ పునరాగమనంపై పార్టీ నేతల డిమాండ్ నేపథ్యంలో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన సూచనలు దుమారం రేపాయి. రాహుల్ గాంధీ పార్లమెంట్లో మరింత క్రియాశీలకంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. రాజకీయాలను భిన్నంగా నడపాలనే రాహుల్ అవగాహనను తాను అర్ధం చేసుకోగలనని, శరద్ పవార్ సూచించిన విధంగా ఆయన దేశమంతా చుట్టిరావాలని, ప్రజలతో మమేకమయ్యేందుకు యాత్రలు కీలకమని డిగ్గీరాజా ట్వీట్ చేశారు. కాగా దిగ్విజయ్ సింగ్ సూచనలపై యువ నేతలు భగ్గుమన్నారు.
రాహుల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు వందసార్లు కాలినడక యాత్రలు చేశారని తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత, లోక్సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్ గుర్తుచేశారు. పార్టీలో ఉన్నతస్ధాయిలో ఉన్న నేతలు రాహుల్కు అండగా నిలవాలని, వెనుకనుంచి విమర్శలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. రాహుల్ పార్టీ పగ్గాలను తిరిగి చేపట్టాలని కోరుతున్న యువనేతలంతా పార్టీ పతనానికి సీనియర్ నేతలే కారణమని మండిపడుతున్నారు.
మధ్యప్రదేశ్లో పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా నిష్ర్కమణకు దిగ్విజయ్ సింగ్తో పాటు కమల్నాథ్లు కారణమని వారు ఆరోపిస్తున్నారు. సింథియా తిరుగుబాటుతో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడానికి సీనియర్ నేతల నిర్వాకమే కారణమని యువనేతలు నిందిస్తున్నారు. రాజస్తాన్లో సచిన్ పైలట్ తిరుగుబాటు కూడా పార్టీలో యువనేతల నిర్లక్ష్యానికి పరాకాష్టగా పేర్కొంటున్నారు.
కాగా, గత వారం చివరలో జరిగిన పార్టీ అంతర్గత భేటీలోనూ కాంగ్రెస్ సీనియర్, యువ నేతల విభేదాలకు వేదికగా నిలిచింది. కరోనా మహమ్మారి, ఆర్థిక మాంద్యం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలను సొమ్ము చేసుకోవడంలో విపక్షంగా విఫలమయ్యామని దీనిపై పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సీనియర్లు పేర్కొన్నారు.
అయితే ఈ అంశాలపై రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు, వీడియోలతో బీజేపీపై సమర్ధంగా పోరాడుతున్నారని సీనియర్ల విమర్శలను యువనేతలు తోసిపుచ్చారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రులు కార్యకర్తలను ఎందుకు విస్మరించారని, మహారాష్ట్ర, ఢిల్లీలో పార్టీ ఎందుకు పతనమైందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ భేటీలో 45 ఏళ్ల రాజ్యసభ ఎంపీ రాజీవ్ సతవ్ పేర్కొన్నారు.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా