మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి.. కంగనా
18-09-202018-09-2020 18:48:52 IST
2020-09-18T13:18:52.894Z18-09-2020 2020-09-18T13:18:47.690Z - - 12-04-2021

సుశాంత్ మరణం తర్వాత సుశాంత్ మద్దతుగా కంగనా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ డ్రగ్స్ కేసుగా మారింది. కంగనా కూడా సమయానుకూలంగా అందరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. బాలీవుడ్ మాఫియాపై, బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసింది. మహారాష్ట్ర పోలీసులపై, మహారాష్ట్ర ప్రభుత్వంపై కూడా సుశాంత్ మరణం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. కొద్ది రోజులుగా శివసేన పార్టీ, మహారాష్ట్ర ప్రభుత్వంకి కంగనాకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని పర్సనల్ గా తీసుకొని కంగనా ఇంటిని కూడా తప్పుడు ఆరోపణలతో కూల్చి వేయించింది. తాజాగా కంగనా మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఓ ఫాసిస్టు ప్రభుత్వంగా ఆరోపిస్తూ ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్ చేసింది కంగనా. గతంలో ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పోల్చడాన్ని శివసేన నేతలు తప్పుపట్టారు. దీంతో ఆమెపై పర్సనల్ గా రివెంజ్ తీసుకోడానికి ప్లాన్ చేసి ముంబైలోని ఆమె సినీ కార్యాలయాన్ని అక్రమ మరమ్మతుల పేరుతో పాక్షికంగా కూల్చివేశారు. ఈ చర్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత కంగనా హైకోర్టును ఆశ్రయించగా, కూల్చివేతపై స్టే విధించింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తర్వాత కంగనా ముంబైను వీడి తన స్వరాష్ట్రానికి వెళ్లిపోయింది. ఇక అప్పడి నుంచి ట్వీట్ల రూపంలో మహారాష్ట్రపై యుద్ధం కొనసాగిస్తోంది. తాజాగా ఈ కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం మహారాష్ట్ర అని, రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంటే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకోవడం మానేసి వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వేధించడమే పనిగా పెట్టుకుందని కంగనా ట్వీట్ చేసింది. ఈ ఫాసిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేసింది. అంతే కాకుండా ఫెమినిస్టులపై కూడా కంగనా మండిపడింది. ఫెమినిస్టులంతా ఎలాంటి ఆధారాలు లేకుండా తన ఇంటిని అక్రమ కట్టడమని అంటున్నారని, తాను ఈ కేసులో బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్పై గెలుస్తానని, బీఎంసీ నష్టపరిహారం చెల్లించక తప్పదని కంగనా వ్యాఖ్యలు చేసింది. అప్పుడు ఈ ఫెమినిస్టులంతా తనకు క్షమాపణ చెబుతారా అని కంగనా ప్రశ్నించింది. కంగనా, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య ఘర్షణలు ఇప్పట్లో తగ్గేలా లేవు అని అనుకుంటున్నారు. మరో పక్క కంగనాని ఒక్క దాన్ని చేసి బాలీవుడ్ మాఫియా, మహారాష్ట్ర ప్రభుత్వం వేధిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
2 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
13 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
13 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
13 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా