మహారాష్ట్రలో క్యాంప్ పాలిటిక్స్ షురూ.. రిసార్ట్స్ బిజీబిజీ
25-11-201925-11-2019 09:06:36 IST
2019-11-25T03:36:36.386Z25-11-2019 2019-11-25T03:36:30.389Z - - 12-04-2021

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు తగిన బలం లేకపోతే ఇక అంతే సంగతులు. ప్రత్యర్ధి పార్టీల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఆయా పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెర తీస్తాయి. రహస్య భేటీలతో ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తాయి. కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముంబై తరలించిన సంగతి తెలిసిందే. రెబల్స్ ఎమ్మెల్యేల కారణంగా కుమారస్వామి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీకి చెందిన యడియూరప్ప ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. మహారాష్ట్ర రాజకీయం క్షణానికో విధంగా మారుతోంది. ఇప్పుడు సీన్ మహారాష్ట్రకు మారింది. మహారాష్ట్రలో సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ సీఎంగా ప్రమాణం చేశారు, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 30వ తేదీన బలనిరూపణకు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీలు తమ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రిసార్ట్ లకు తమ ఎమ్మెల్యేలను తరలిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో ఆదివారం రాత్రి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమావేశం కావడంతో ఈ వార్తలు మరింత పెరిగాయి. ఇద్దరు నేతలు రహస్య చర్చలు జరిపారని తెలుస్తోంది. వీరిద్దరూ బల నిరూపణకు తీసుకోవలసిన చర్యలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అయితే సీఎంవో మాత్రం రైతుల సమస్యల గురించి చర్చించామని చెబుతోంది. మహారాష్ట్రలో జాగ్రత్త పడుతున్నాయి ప్రధాన పార్టీలు. హోటల్ నుండి ఎమ్మెల్యేలను వేరేచోటికి తరలిస్తున్నారు. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎటు వెళ్ళినా శివసేనకు సమాచారం అందేలా ఏర్పాట్టు చేశారు. శివసేన నెట్ వర్క్ మీద నమ్మకంతో తమ ఎమ్మెల్యేలను కూడా ముంబైలోనే ఉంచాయి కాంగ్రెస్-ఎన్సీపీలు. .మారియట్ హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక.లలిత హోటల్లో శివసేన ఎమ్మెల్యేలు...రేనిసోన్ హోటల్లో ఎన్సీపీ ఎమ్మెల్యేలకు బస కల్పించారు. వారికి సకల ఏర్పాట్లు చేశాయి ఆయా పార్టీలు. హోటల్లో పని చేసే వర్కర్స్ తో శివసేన నిఘా ఏర్పాటుచేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో తాజా పరిణామాలపై కాంగ్రెస్ ఆచితూచి స్పందిస్తోంది. బలనిరూపణ బీజేపీని భయపెడుతోందని.. ఆపార్టీ నేతలు పారిపోతున్నారని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. తగినంత సంఖ్యా బలం లేకపోవడం వల్లే బీజేపీ వెనకడుగు వేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ విమర్శించారు. అర్థరాత్రి చర్చలు, ఉదయం ప్రమాణస్వీకారాలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం అక్రమమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. గవర్నర్ కార్యాలయాన్ని ఉపయోగించుకొని బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ నేతలు ఘాటు విమర్శలు చేస్తోంది. బలనిరూపణకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నాయకత్వంలోని ధర్మాసనం ఏం తీర్పునిస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
6 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
16 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
17 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా