మన సైనికులే మన బలం.. వారి త్యాగాలు మర్చిపోవద్దు
28-06-202028-06-2020 13:31:30 IST
Updated On 28-06-2020 13:31:53 ISTUpdated On 28-06-20202020-06-28T08:01:30.778Z28-06-2020 2020-06-28T08:01:21.206Z - 2020-06-28T08:01:53.978Z - 28-06-2020

భారత్ను శాంతియుత దేశంగా ప్రపంచం చూస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.. తాజా పరిణామాల నేపథ్యంలో దేశ ప్రజలు చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారనీ... కానీ... శాంతి మంత్రం ద్వారానే అన్నీ సాధ్యమవుతాయని మనం ప్రపంచానికి చాటిచెబుతున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు పదకొండు గంటలకి మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆకాశ వాణి ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలపై కూడా ప్రస్తావించారు. కరోనా వచ్చి ఆరు నెలలు అయిపోయిందన్న మోదీ... అందరూ 2020 ఎప్పుడు అంతమవుతుందా అని ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరం చాలా సవాళ్లు ఎదురవుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. మనం సవాళ్లు వచ్చినప్పుడల్లా ఎదురు నిలిచి గెలిచినట్లు మన చరిత్ర చెబుతోందని మోదీ గుర్తుచేశారు. సవాళ్ల తర్వాత మనం మరింత బలంగా అవుతామని అన్నారు. మనదేశానికి సైనికులే బలం అన్న మోడీ వారిత్యాగాలకు సలాం చేశారు. భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన భారతీయ సైనికుల పోరాటాన్ని గుర్తుచేశారు. ఇటీవల లడక్లోకి వచ్చేందుకు యత్నించిన చైనా సైన్యానికి భారత సైన్యం తగిన బుద్ధి చెప్పిందన్నారు. దేశానికి సమస్య వచ్చే పరిస్థితి రానివ్వబోమని మన సైనికులు నిరూపించారన్న మోదీ... మొన్నటి ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులవ్వడంపై దేశంలోని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారని అన్నారు. అమరులైన సైనికుల తల్లిదండ్రులు మరింత మందిని సైన్యంలోకి పంపేందుకు సిద్ధంగా ఉన్నారనీ.. అది మన బలం అని మోదీ అన్నారు. మనదేశంపై కన్నేసిన వారిని మన సైనికులు ఊరుకోలేదన్నారు. మన దేశీయ ఉత్పత్తులను మనం వాడాలన్నారు. పరోక్షంగా చైనా ఉత్పత్తులు బహిష్కరించాలని మోడీ పిలుపునిచ్చారు. కరోనా పెరుగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలనీ, అందరూ మాస్కులు వాడాలని మోదీ కోరారు. భౌతిక దూరాన్ని ఎవరికి వారు తమ ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. మనం జాగ్రత్తగా ఉండటం ద్వారా ఇతరుల్ని జాగ్రత్తగా ఉంచగలం అన్నారు మోడీ. మాజీ ప్రధాని పీవీ శతజయంతి ఉత్సవాల వేళ ఆయన సేవల్ని మోడీ గుర్తుచేసుకున్నారు. అత్యంత విపత్కర సమయంలో తన సంస్కరణల ద్వారా భారత్ ను ముందుకు నడిపారని మెచ్చుకున్నారు. గొప్ప రాజకీయ వేత్త, గొప్ప ప్రతిభాశాలి అని అన్నారు. చిన్నప్పటి నుంచే అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వం ఉన్న పీవీ... దేశ ప్రజలు... ఆయన చరిత్రను తెలుసుకోవాలని కోరారు.

ఏపీలో స్కూల్స్ బంద్
13 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
13 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
17 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
19 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
14 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
21 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
21 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్పై ప్రమాణం చేయగలరా
13 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
15 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
21 hours ago
ఇంకా