మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్కి కరోనా... ప్రభుత్వాసుపత్రిలో చికిత్స
25-07-202025-07-2020 18:47:13 IST
Updated On 25-07-2020 19:12:34 ISTUpdated On 25-07-20202020-07-25T13:17:13.779Z25-07-2020 2020-07-25T13:16:32.365Z - 2020-07-25T13:42:34.494Z - 25-07-2020

కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు.. సామాన్యులు.. ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైరస్బారినపడగా.. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్సింగ్ చౌహన్కు కరోనా సోకింది. గత రెండు రోజులుగా తీవ్ర దగ్గు, జలుబుతో బాధపడుతున్న సీఎంకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో భోపాల్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎంకు పాజిటివ్గా తేలడంతో ఆయనతో కలిసి తిరిగిన నేతలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన్ని కలిసిన అధికారులు, మంత్రులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా దేశంలో కరోనా బారినపడిన తొలి సీఎం శివరాజ్సింగ్ చౌహాన్. ‘కరోనా లక్షణాలని అనుమానం రావడంతో పరీక్షలు చేసుకున్నా. ఆ పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొన్న వారందరూ కోవిడ్ పరీక్షలు చేసుకోండి. ఇదే నా విన్నపం. వారందరూ హోం క్వారంటైన్లోకి వెళ్లిపోండి’ అని ట్విట్టర్ వేదికగా శివరాజ్ విజ్ఞప్తి చేశారు. ఎవరూ ఆందోళనకు గురికావద్దని, ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏమైనా అత్యవసరం అయితే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతానన్నారు సీఎం శివరాజ్ సింగ్. ఆయన త్వరగా కోలుకోవాలని రాజకీయనేతలు ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే ట్విట్టర్ లో టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ కరోనా బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స చేయించుకుంటున్నారు. బహుశా ఆయన పాలనపై ఉన్న నమ్మకమై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. టెస్టింగ్ లో నెంబర్ 1, వైద్యం అద్భుతం అంటున్న యుశ్రారైకపా నాయకులు ఏపీలో చికిత్సకి ఎందుకు జంకుతున్నారు? జగన్ గారి పాలన ఆహా, ఓహో అన్న విజయసాయి రెడ్డి గారు కరోనా పాజిటివ్ రాగానే హైదరాబాద్ ఎందుకు పారిపోయారు? ప్రజలకి నాటు వైద్యం, మీ నాయకులకు కార్పొరేట్ వైద్యమా జగన్ రెడ్డి గారు? అంటూ ప్రశ్నించారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
5 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
6 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
6 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
10 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
11 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
9 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
12 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
12 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
7 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
14 hours ago
ఇంకా