బ్రేకింగ్: ఔరంగాబాద్లో ఘోర రైలు ప్రమాదం...16మంది వలస కూలీల మృతి
08-05-202008-05-2020 08:39:28 IST
Updated On 08-05-2020 11:50:23 ISTUpdated On 08-05-20202020-05-08T03:09:28.350Z08-05-2020 2020-05-08T03:08:32.128Z - 2020-05-08T06:20:23.995Z - 08-05-2020

దేశంలో వరుస ప్రమాదాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో 16 మంది వలస కూలీలు చనిపోయారు. మృతి చెందినవారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కర్మాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్పై వలస కూలీలు నిద్రస్తుండగా, వారిపై నుంచి గూడ్స్ రైలు వెళ్ళినట్లు ప్రాథమిక సమాచారం. ఔరంగబాద్ కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాక్పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది.ఈప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో, ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులంతా మధ్యప్రదేశ్కు వెళ్తున్న వలస కార్మికులుగా గుర్తించారు. పట్టాలపై నిద్రిస్తున్న వారిని రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. కర్మాడ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వలస కార్మికులు గూడ్స్రైలును రాకను గమనించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆర్పీఎఫ్, రైల్వే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి బయల్దేరారు. లాక్డౌన్ వల్ల పలువురు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లే క్రమంలో.. రైల్వే ట్రాక్లపై నడుచుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాధిత కూలీలు నిత్యం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్ లను ఉపయోగిస్తున్నారు. కాస్త దూరం నడిచి అలసిపోతున్నవారంతా ఆ ట్రాక్ లపైనే నిద్రిస్తున్నారు. పాసింజర్ రైళ్ళ రాకపోకలు లేకపోయినా గూడ్స్ రైళ్ళు దేశవ్యాప్తంగా తిరుగుతున్న సంగతి తెలిసిందే. నిద్రలో వున్నవారంతా రైలు వచ్చిన అలికిడి వినపడక మృత్యుతీరాలకు చేరిపోయారు. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. మహారాష్ట్రలో జరిగిన రైలు ప్రమాదంలో 16 మంది మృతిచెందడం విచారకరం. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం తరఫున మృతుల బంధువులను ఆదుకుంటామన్నారు. 24 గంటల వ్యవధిలోనే నాలుగు ప్రమాదాలు జరిగాయి. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకై 12 మంది చనిపోయారు. వందలాదిమంది గ్యాస్ ప్రభావానికి లోనై అస్వస్థతకు గురయ్యారు. ఛత్తీస్ ఘడ్ లోని రాయ్గఢ్ పేపర్ మిల్లు కూడా ప్రారంభమయింది. గురువారం మధ్యాహ్నం మిల్లులోని ట్యాంక్ను శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు వెళ్లారు. ట్యాంకులోకి దిగి శుభ్రం చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకై అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకొని.. కార్మికులను ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా రాత్రి తమిళనాడులోని నైవేలీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 10మంది కార్మికులు గాయపడ్డారు. కడలూరు జిల్లా నైవేలీ థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్లో గురువారం సాయంత్రం ఒక బాయిలర్ అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
14 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా