ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారు ఇండియా.. ఐటీ మంత్రి
03-06-202003-06-2020 07:09:29 IST
Updated On 03-06-2020 09:08:37 ISTUpdated On 03-06-20202020-06-03T01:39:29.876Z03-06-2020 2020-06-03T01:39:27.825Z - 2020-06-03T03:38:37.218Z - 03-06-2020

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా నిలిచిందని కేంద్ర న్యాయ, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 200కి పైగా మొబైల్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు సోమవారం ప్రకటించారు. భారతదేశంలో ఇప్పటివరకు 330 మిలియన్ మొబైల్ హ్యాండ్సెట్లు తయారైనట్టు చెబుతూ దీనికి సంబంధించిన డేటాను కేంద్ర మంత్రి షేర్ చేశారు. 2014లో కేవలం 2 ప్లాంట్లలో 60 మిలియన్ల మొబైల్ ఫోన్లు మాత్రమే తయారు అయ్యాయి. వీటి విలువ కూడా 2014లో 3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2019లో 30 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2014లో భారత్లో మొబైల్ తయారీ సంస్థలతో పోలిస్తే 2019 నాటికి 200 శాతం పెరుగుదల నమోదైందని కేంద్రమంత్రి ప్రజంటేషన్ ద్వారా తెలిపారు. 2019లో భారత్లో తయారైన మొబైల్ ఫోన్ల సంఖ్య 30 కోట్ల 30 లక్షలు దాటిందని వీటి విలువ 3 కోట్ల డాలర్లకు చేరుకుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే నేడు (జూన్ 2న) మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశంలో భారతీయ ఎలక్ట్రానిక్ రంగం కోసం కొత్త పథకాలను ప్రకటించనున్నారు. భారీ దిగుమతిదారుగా ఉన్న భారత్ గత ఐదేళ్లలో బలమైన ఎగుమతిదారుగా అవతరించిందని ఎలక్ట్రానిక్స్ ఇండియా ట్వీట్ చేసింది. భారత్ను అతిపెద్ద మొబైల్ తయారుదారు దేశంగా అంతర్జాతీయ మొబైల్ ఉత్పత్తి కంపెనీలు పరిగణించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారు అయిన భారత్తో భాగం పంచుకోవాలని ప్రముఖ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి అని ఎలెక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆపెల్తో సహా పలు సుప్రసిద్ధ స్మార్ట్ ఫోన్ కంపెనీలు భారత్లో స్థానికంగా మొబైల్ ఫోన్ల తయారీని ప్రారంభించాలని చూస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు భారత్లో తమ ఉత్పత్తులు ప్రారంభించేశాయి. జియోమీ ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ ఈ విషయమై ట్వీట్ చేస్తూ, భారత్లోని 99 శాతం ఎమ్ఐ, రెడ్ మీ ఫోన్లు మేడ్ ఇన్ ఇండియాకు చెందినవే అని ఇక 65 శాతం విడి భాగాలు స్థానికంగానే లభ్యమవుతున్నాయని చెప్పారు. ఇండియాలోని తమ కంపెనీలో 35 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, జియోమీ ప్లాంటులో 95 శాతం మహిళలే పనిచేస్తున్నారని మను కుమార్ పేర్కొన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
3 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
an hour ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
6 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా