పార్టీ తరపున డబ్బు తీసుకుంది నిజమే.. అహ్మద్ పటేల్
07-03-202007-03-2020 12:28:28 IST
2020-03-07T06:58:28.405Z07-03-2020 2020-03-07T06:58:26.306Z - - 11-04-2021

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున రూ. 550 కోట్ల డబ్బును పార్టీ కోశాధికారి హోదాలో తీసుకున్నది నిజమేనని అహ్మద్ పటేల్ అంగీకరించారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలతో బిజీగా ఉన్నానని.. త్వరలోనే ఐటీ శాఖ ఇచ్చిన నోటీస్లపై స్పందిస్తానని తెలిపారు. తనకు ఇ- మెయిల్ ద్వారా రెండు నోటీస్లు వచ్చాయని.. పార్లమెంటు సమావేశాల తర్వాత ఐటీ శాఖ ఎదుట హాజరవుతానని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఐటీ దాడుల గురించి శుక్రవారం ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు అహ్మద్ పైవిధంగా సమాధానమిచ్చారు. ఆదాయ పన్ను శాఖ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ తొలిసారిగా స్పందించారు. రూ. 550 కోట్ల లావాదేవీలపై తనకు నోటీసులు వచ్చినట్లు ఆయన ధ్రువీకరించారు. పార్టీ తరఫున ఆ డబ్బు స్వీకరించామని స్పష్టం చేశారు. అలాంటి విరాళాలు ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల అవసరాలకోసం తీసుకుంటుంటాయని అహ్మద్ పటేల్ సమర్థించుకున్నారు. గత అక్టోబర్ 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు దేశవ్యాప్తంగా 40 చోట్ల ఐటీ శాఖ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, పుణెతో పాటు, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న అహ్మద్ పటేల్కు ఐటీ శాఖ నోటీస్లు జారీ చేసింది. అయితే ఆనాటి నుంచి తనకు ఆరోగ్యం బాగోలేదంటూ అహ్మద్ పటేల్ విచారణకు హాజరుకాలేదు. కాగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ భారీ మొత్తంలో డబ్బు సేకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నేత, సీఎం కమల్నాథ్ ఇంట్లో 20 కోట్ల నగదు దొరికినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇక హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖలో రెండో విడత తనిఖీలు జరిపిన ఐటీ అధికారులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాసరావు ఇంట్లో కీలక ఆధారాలు లభించిన విషయం తెలిసిందే. వరుసగా ఆరు రోజులపాటు జరిగిన ఈ దాడుల్లో మొత్తం ఉమ్మడి ఏపీ నుంచి రూ.2వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వేర్వేరు మార్గాల్లో కాంగ్రెస్ పార్టీకి రూ.2వేల కోట్లు చేరినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ కంపెనీకి భారీ కాంట్రాక్టు ఇచ్చారని.. రూ.2652 కోట్ల పనులకు సంబంధించిన ఆ కాంట్రాక్టు నుంచి 20శాతం ముడుపులు పుచ్చుకునేలా ఒప్పందం జరిగిందని గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ముడుపులకు సంబంధించి ఐటీ శాఖకు కీలక ఆధారాలు దొరకడంతో వాటి ఆధారంగా... మొత్తం రూ.700 కోట్ల మేర ముడుపులకు ఒప్పందం జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. వాటి ప్రకారం..ఈ మొత్తంలో ఒకే విడతలో ఏపీ ప్రముఖుడికి రూ.150కోట్ల ముడుపులు అందాయి... మిగిలిన రూ.550 కోట్ల ముడుపులు పొలిటికల్ ఫండింగ్ కోసం మరో మార్గంలో పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ముడుపులు చేరాయి. దర్యాప్తులో భాగంగా... అహ్మద్ పటేల్కు రూ.550 కోట్ల ముడుపులపై ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ముడుపులు, విరాళాలకు సంబంధించి గతంలో రాజకీయపార్టీలకు నోటీసులు పంపితే జూనియర్ స్థాయి కార్యదర్శులను మాత్రమే ఆయా పార్టీలు ఐటీ వర్గాల వద్దకు పంపేవారిని. కానీ సమస్య తీవ్రత రీత్యా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్కు నేరుగా నోటీసులు పంపామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. అక్రమంగా ముడుపుల స్వీకరణకు సంబంధించిన నేరం తారస్తాయికి చేరుకుంది కాబట్టే పార్టీ కోశాధికారికే సమన్లు పంపాల్సివచ్చిందని అధికారులు తెలిపారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
13 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
9 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
11 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
18 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
20 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా