తెరపైకి ఉద్ధవ్ థాక్రే వారసుడు..?
14-06-201914-06-2019 08:34:37 IST
Updated On 22-06-2019 16:17:05 ISTUpdated On 22-06-20192019-06-14T03:04:37.813Z14-06-2019 2019-06-14T03:01:04.169Z - 2019-06-22T10:47:05.186Z - 22-06-2019

మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శివసేన పార్టీ చరిత్రలో తొలిసారిగా ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. బీజేపీ-శివసేన కూటమి ఈసారి సీఎం కుర్చీని తలోరెండున్నరేళ్ళు పంచుకోవాలన భావిస్తున్నాయి. బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న శివసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేను బరిలోకి దించుతుందని వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో తాను చెప్పేదేమీ లేదని వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలా నడవాలో పార్టీ అధినేత నిర్ణయిస్తారని ఆదిత్య చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అక్టోబర్ మాసంలో జరగనున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా...ఇరు పార్టీలు తలా 135 స్థానాలు పంచుకోవాలని బీజేపీ ప్రతిపాదిస్తోంది. మిగిలిన స్థానాలను కూటమిలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు కేటాయించాలని బీజేపీ నేతలు సూచిస్తున్నారు. అయితే దీనికి శివసేన సుముఖంగా లేదని సమాచారం. తమ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో సగం స్థానాలు(144) తమ పార్టీకి కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ బలం 122గా ఉండగా, శివసేనకు 63, కాంగ్రెస్ 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేనకు చెందిన విజయ్ రావ్ ఆటీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా కొనసాగుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమిగా ఏర్పడి పోటీ చేయగా మొత్తం 48 లోక్ సభ స్థానాల్లో...బీజేపీ 23 స్థానాలు, శివసేన 18 స్థానాల్లో గెలిచాయి. ఎన్సీపీ నాలుగు స్థానాలు, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలవగా...మజ్లీస్ పార్టీ 1, ఇతరులు మరో స్థానంలో గెలిచారు. అన్నింటి కంటే ముందుగా రాష్ట్రంలో పార్టీ అత్యధికంగా సీట్లు గెలుచుకునేలా కృషి చేయడమే తన పని అని శివసేన నేతలు చెబుతున్నారు. బీజేపీ శివసేన కూటమి అధికారంలోకి వస్తే శివసేనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ వాదనను పార్టీ సీనియర్ నేత సంజీయ్ రౌత్ ఖండించారు. థాక్రే లు ఎప్పడూ ఉపముఖ్యమంత్రి పదవులు తీసుకోరు. వారిదే పై చేయిగా ఉంటుందన్నారు. దీనిని బట్టి ఆలోచిస్తే ఆదిత్య థాక్రే సీఎం రేసులో ఉన్నట్టు అర్థం అవుతోంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా