ఢిల్లీలో పెరిగిన చలి.. ఎన్నికల వేడి
24-01-202024-01-2020 09:17:40 IST
Updated On 24-01-2020 11:41:45 ISTUpdated On 24-01-20202020-01-24T03:47:40.687Z24-01-2020 2020-01-24T03:40:48.966Z - 2020-01-24T06:11:45.476Z - 24-01-2020

ఢిల్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఢిల్లీలో కొన్ని మురికివాడలు మినహా మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి కనిపిస్తుంటుంది. ఎన్నికల ప్రచారంలో ఆప్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని ఇండియా వర్సస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కపిల్ మిశ్రా చేసిన కామెంట్లు వివాదం రేపుతున్నాయి. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే హిందూత్వ ఎజెండా, మోదీ క్రేజ్తోనే బీజేపీ ఎన్నికల గోదాలో దిగుతోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సుపరిపాలననే నమ్ముకుంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపి పూర్వ వైభవాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉంది. అయిదేళ్లలో తన పనితీరు నచ్చితేనే మరోసారి ఓటు వేయండి అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓటర్లకి విజ్ఞప్తి చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. అంతేకాదు కొన్ని తాయిలాలు కూడా ప్రకటిస్తున్నారు కేజ్రీవాల్. నెలకి 20 కిలో లీటర్ల కంటే తక్కువ వాడుకున్న వారికి ఉచితంగా నీరు, 32 శాతం వరకు తగ్గిన విద్యుత్ ధరలు, స్కూలు ఫీజుల్ని పెంచకపోవడం, ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్ ద్వారా ఉచిత ఆరోగ్య పరీక్షలు వంటివి మళ్లీ గెలిపిస్తాయని ఆప్ భావిస్తోంది. లోక్సభ బీజేపీకి, శాసనసభ ఆప్కి అన్న పోస్టర్లు రాజధాని వీధుల్లో కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా కేజ్రీవాల్ హుందాగా ప్రచారం చేస్తున్నారు. గతంలో కంటే ఈసారి కొత్త ముఖాలకి టిక్కెట్లు ఇచ్చి కేజ్రీవాల్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం నాయకత్వ లేమి బాగా కనిపిస్తోంది. ఇదే లోటు అంటున్నారంతా. 1998 నుంచి 2013వరకూ కాంగ్రెస్ తన సత్తా చాటింది. అయితే ఆప్ రాకతో కాంగ్రెస్ ప్రభ కోల్పోయింది. మళ్లీ పూర్వ వైభవం కోసం ఆపార్టీనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. దీంతో విమానలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మంచు కారణంగా విమానాలను దారిమళ్ళిస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా తగ్గాయి. ఆరేడు డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు పెరగడం లేదు. ఈప్రభావం ఎన్నికల ప్రచారంలో కనిపిస్తోంది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
an hour ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
3 hours ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
2 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
4 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
4 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
5 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
21 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
22-04-2021
ఇంకా