జైలుకెళ్లిన వారు కూడా నన్ను ప్రశ్నించడమే.. షాపై శరద్ పవార్ ఆగ్రహం.!
18-09-201918-09-2019 12:27:25 IST
2019-09-18T06:57:25.299Z18-09-2019 2019-09-18T06:57:05.499Z - - 11-04-2021

ఇప్పటికే జైలుకెళ్లి బెయిల్ మీద బయటికి వచ్చిన వారికి నేను సాధించిన విజయాలపై ప్రశ్నించే హక్కు లేదని నేషనల్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ ఎద్దేవా చేశారు. షోలాపూర్లో మంగళవారం ఒక బహిరంగ సమావేశంలో పాల్గొన్న శరద్ పవార్ మహారాష్ట్రకు తాను చేసిన దోహదం ఏమిటంటూ ప్రశ్నించిన కేంద్ర హోమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జైలుకెళ్లి వచ్చినవారు తనను ప్రశ్నిచనే కూడదని పరిహసించారు.
మహారాష్ట్రకు శరద్ పవార్ ఏం చేశాడని ఒక పార్టీ (బీజేపీ) పెద్ద మనిషి ప్రశ్నిస్తున్నారు. నేను ఒక విషయం చెప్పగలను. శరద్ పవార్ అనే వ్యక్తి మంచి పనులు చేశాడో లేక చెడ్డపనులు చేశాడో నాకు తెలియదు కానీ తానెన్నడూ జైలుకు మాత్రం పోలేదు. కాని తాము చేసిన నేరాలకు ఇప్పటికే జైలుకి వెళ్లి వచ్చిన వారు నేనేం చేశానని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఒక్కటి మాత్రం చెప్పగలను. కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేసినప్పుడు వ్యవసాయదారులపై ఉన్న రూ. 75,000 కోట్ల రుణాలను మాఫీ చేశాను అని శరద్ పవార్ జోడించారు.
సోహ్రాబుద్దీన్ షేక్ను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేసిన ఆరోపణలపై 2010లో సీబీఐ పెట్టిన కేసులో భాగంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అరెస్టయి జైలుకెళ్లారు. తర్వాత ఆయనపై కేసును కొట్టేశారు. ఈనెల మొదట్లో షోలాపూర్లో జరిగిన బహిరంగ సభకు హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మహారాష్ట్రకు చేసిన మేలు ఏమిటి అని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాతావరణం వేడెక్కుతున్న సందర్భంగా బీజేపీ, ఎన్సీపీ నేతల మధ్య యుద్ధవాతావరణం నెలకొనడం గమనార్హం.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
12 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
9 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
11 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
16 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
18 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
19 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా