ఇవాళ సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్.. వ్యూహం ఏంటో?
27-04-202027-04-2020 08:22:32 IST
Updated On 27-04-2020 09:17:53 ISTUpdated On 27-04-20202020-04-27T02:52:32.070Z27-04-2020 2020-04-27T02:52:23.857Z - 2020-04-27T03:47:53.979Z - 27-04-2020

లాక్ డౌన్ రెండవ దశ కూడా మరోవారం రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్డౌన్ తరువాత ఎలా వ్యవహరించాలి? ఇదే ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్. మే నాలుగు నుంచి ఏమి చేయాలనేదానిపై కేంద్రం ఇప్పటికే స్థూలంగా ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ విస్తరణను అదుపు చేయడం-ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడం మధ్య సమతౌల్యాన్ని పాటిస్తూ కనిష్ఠ చలనం... గరిష్ఠ పని అన్న నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్లనుందని తెలుస్తోంది. దీని ప్రకారం తక్కువ మందితో ఎక్కువ పనిచేయించడం. సోమవారం ఉదయం ముఖ్యమంత్రులతో జరపనున్న వీడియో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రణాళిక గురించి చర్చించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు స్వీకరించిన తరువాతనే కార్యాచరణ ప్రణాళికను కేంద్రం ఖరారు చేయనుంది. క్రమేణా ఆంక్షలను సడలించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇవ్వనుంది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కేంద్రం ప్రతిపాదించిన ప్రణాళికలో అనేక అంశాలు ఉండనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో కొందరు ఇళ్ల నుంచే విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. కర్మాగారాలు, వ్యాపార సంస్థల్లో పనిచేసేందుకు భౌతిక దూరం పాటించేలా షిఫ్టు వేళల్లో మార్పులు చేసే అవకాశం. ఈ విషయంలో పారిశ్రామిక సంస్థలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని అమలు చేయాలని భావిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇస్తూ కరోనా సోకని గ్రీన్ జోన్ ప్రాంతాల్లో ఆర్థిక కార్యక్రమాలు కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలపై ఫోకస్ పెట్టనుంది. ఇటు దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేసే అంశంపై చర్చించనున్నారు మోదీ.మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలంటున్నాయి పలు రాష్ట్రాలు. ఈనేపథ్యంలో ప్రధాని ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో మే 7వ తేదీ వరకూ లాక్ డౌన్ అమలులో వుంది. లాక్డౌన్ అమలుతో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిరోజులు ప్రజలు లాక్డౌన్కు సహకరించాలని కేసీఆర్ అంటున్నారు. ప్రగతిభవన్లో మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం నిన్న సమీక్ష చేశారు.ప్రధాని మోదీతో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమీక్షలో సీఎం అధికారులతో చర్చించారు. ఏపీలో మాత్రం కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1097కి చేరింది. ఇప్పటివరకు 31 మంది మృతి చెందగా, 231 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 835గా ఉన్నాయి.రాజ్ భవన్లోకి కరోనా ప్రవేశించడంతో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తం అయ్యాయి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
5 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
an hour ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
8 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా