ఇక దేశమంతా 21 రోజుల లాక్ డౌన్.. మోడీ సంచలన ప్రకటన
24-03-202024-03-2020 20:32:12 IST
Updated On 24-03-2020 20:53:25 ISTUpdated On 24-03-20202020-03-24T15:02:12.984Z24-03-2020 2020-03-24T15:02:00.499Z - 2020-03-24T15:23:25.026Z - 24-03-2020

అంతా ఊహించినట్టే కరోనాపై ప్రధాని మోడీ యుద్ధం ప్రకటించారు. ఇవాళ రాత్రి 12 గంటల నుంచి దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు ప్రధాని మోడీ. కరోనా మహమ్మారి పెరిగిపోతున్న వేళ మోడీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 22 రాష్ట్రాలు లాక్ డౌన్లో వున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్. ఎట్టిపరిస్థితుల్లో జనం బయటకి రాకూడదు. లాక్ డౌన్ అంటే కర్ఫ్యూలాంటిదే. ప్రధానిగా చెప్పడంలేదు. మీ కుటుంబసభ్యుడిగా, మీ సేవకుడిగా చెబుతున్నా మూడువారాలపాటు లాక్ డౌన్ లో వుంటే కరోనా పై పోరాటం పూర్తవుతుంది. లాక్ డౌన్ లక్ష్మణ రేఖను దాటిరావద్దు. ఎక్కడి వాళ్ళు అక్కడే వుండండి. కరోనా అంటే ఇంట్లోనే వుండాలి, కేంద్ర ఆరోగ్యశాఖకు 15 వేల కోట్లు విడుదల చేశామన్నారు ప్రధాని మోడీ. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని మోడీ తన సందేశం ఇచ్చారు. కష్టకాలంలో వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మీడియా కృషిని ప్రశంసించారు. స్వంత వైద్యం పనికిరాదని, పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్లలు అవసరం అన్నారు. మన కోసం, మన పిల్లల కోసం స్వీయ గృహనిర్బంధంలో వుండాలన్నారు. జనతా కర్ఫ్యూ కంటే కఠినమైన కర్ఫ్యూ ఇదన్నారు. ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధం. ప్రతీ నగరం,ప్రతీ ఊరు,ప్రతీ వీధి లాక్డౌన్ లోకి వెళ్లాల్సిందే. వచ్చే 21 రోజుల పాటు ఈ నిర్బంధం అమలులో ఉంటుందన్నారు. కరోనా మహమ్మారిని జయించాలంటే ఈ స్వీయ నిబంధన తప్పదు. లేకుంటే దేశం..మీ కుటుంబం 21 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతుందన్నారు. మీ ఇంటి గుమ్మం ముందు ఒక లక్ష్మణ రేఖ గీయండి. దానిని దాటి ముందుకు రావద్దన్నారు మోడీ. రోనా సోకినవారు తొలుత సాధారణంగానే ఉంటారనీ.. కాబట్టి ఇతరులను కలిసే ప్రయత్నం చేయారాదన్నారు. ఈ వ్యాధి లక్షణాలు బయట పడేందుకు కొన్ని రోజుల పడుతుంది గనుక ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అన్నారు మోడీ. ఈ వ్యాధి బారిన పడిన మొదటి లక్ష మంది గుర్తించడానికి 67 రోజులు పట్టిందనీ, అనంతరం కేవలం 11 రోజుల్లోనే ఆ సంఖ్య 2 లక్షలకు చేరిందని ప్రధాని తెలిపారు. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే బాధితుల సంఖ్య 3 లక్షలకు పెరిగిపోయిందన్నారు. రానున్న 21 రోజులు దేశానికి చాలా కీలకమని ప్రధాని అన్నారు. ఈలాక్డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుందనీ.. కానీ, ప్రజల ప్రాణాలు కాపాడాలంటే ఈ కఠిన నిర్ణయం తప్పనిసరి అని ప్రధాని అన్నారు. ఈ 21 రోజులు మన ప్రాణాల కంటే ఎక్కువ కాదని, ప్రధాని నుంచి గ్రామస్తుల వరకు సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని ప్రధాని తెలిపారు. ఈ మహమ్మారి పట్ల నిర్లక్ష్యం చేయబట్టే చైనా, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు ప్రస్తుతం చాలా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కుంటున్నాయని ప్రధాని వెల్లడించారు. అలాంటి పరిస్థితులు మన దగ్గరికి రాకూడదంటే కఠిన నిర్ణయాలు తప్పవన్నారు మోడీ.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా