ఆగని ఆందోళనలు.. యూపీలో ఆరుగురి మృతి
21-12-201921-12-2019 08:19:28 IST
2019-12-21T02:49:28.020Z21-12-2019 2019-12-21T02:49:10.236Z - - 10-04-2021

మోడీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. ఆందోళనకారులు రాళ్ళు విసరడం, నిరసన ర్యాలీలు చేపట్టడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. యూపీ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. శుక్రవారం యూపీలో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. యూపీలో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు పౌరులు మరణించారు.
దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై జరిగిన ఆందోళన కారణంగా ఇప్పటి వరకు యూపీలో ఏడుగురు మరణించారని పోలీసులు తెలిపారు.
యూపీ డీజీపీ ఆందోళనలపై మాట్లాడారు. తాము ఒక్క బుల్లెట్ ఉపయోగించలేదన్నారు. బిజ్నోర్లో ఇద్దరు, సంభాల్, ఫిరోజాబాద్, మీరట్, కాన్పూర్లో ఒక్కరేసి ఆందోళనకారులు మరణించారు. మరోవైపు ఇతర ప్రాంతాల్లో కూడా ఆందోళనకారులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లు రవ్వుతూ.. దాడులకు పాల్పడ్డారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు 144 సెక్షన్ విధించారు.
సీఏఏపై మమతా బెనర్జీ తీరుని ఆ రాష్ట్ర గవర్నర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆమె వైఖరి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. దేశ అంతర్గత విషయాల్లో బయటి సంస్థల జోక్యాన్ని స్వాగతించడం ద్వారా మమతా బెనర్జీ రాజ్యాంగ విరుద్ధమైన వైఖరి ప్రదర్శించారని మండిపడ్డారు.

సీఏఏపై, ఎన్నార్సీపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ చట్టంలో పొందుపర్చిన పౌరసత్వం నిబంధనలపై కేంద్రం వివరణ ఇచ్చింది. జూలై 1, 1987న లేదా ఆ లోపు భారత్లో జన్మించిన వారు సహజంగానే భారతీయ పౌరులవుతారని తెలిపింది. అలాగే, ఆ తేదీ(జూలై 1, 1987)లోపు వారి తల్లిదండ్రులు భారత్లో జన్మించినట్లైనా కానీ ఆ పిల్లలు చట్టప్రకారం భారతీయ పౌరులవుతారని కేంద్రం పేర్కొంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
5 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా