అజ్ఞాత విరాళాలమీదే బతికేస్తున్న రాజకీయపార్టీలు.. 15 ఏళ్లలో రూ.11 వేల కోట్లు
10-03-202010-03-2020 15:12:14 IST
Updated On 10-03-2020 16:32:50 ISTUpdated On 10-03-20202020-03-10T09:42:14.810Z10-03-2020 2020-03-10T09:42:10.868Z - 2020-03-10T11:02:50.893Z - 10-03-2020

గత పదిహేనేళ్ల కాలంలో దేశంలోని రాజకీయ పార్టీలు అజ్ఞాత మార్గాల ద్వారా రూ. 11,234 కోట్లను విరాళాలుగా అందుకున్నాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆప్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లతో పాటు వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా అజ్ఞాత విరాళాల స్వీకరణలో పోటీ పడుతున్నాయయని ఏడీఆర్ పేర్కొంది. దేశంలోని జాతీయ పార్టీలు గత 15 ఏళ్ల కాలంలో అంటే 2004-05 నుంచి 2018-19 వరకూ అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను అందుకున్నాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీలు ఈసీకి సమర్పించిన వివరాలను పరిశీలించిన మీదట ఏడీఏ ఈ నివేదికను రూపొందించింది. రూ 20000 కంటే తక్కువ విలువైన విరాళాలను పార్టీలు అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చిన నిధులుగా ఆయా పార్టీలు ఐటీ రిటన్స్లో పేర్కొంటాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల అమ్మకాలు, రిలీఫ్ ఫండ్, ఇతర ఆదాయం, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు, మోర్చాల్లో వసూలైన మొత్తాలు వంటి రాబడిని అజ్ఞాత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు. 2004-05 నుంచి 2018-19 వరకూ జాతీయ రాజకీయ పార్టీలు రూ 11,234 కోట్లు ఈ మార్గాల ద్వారా సమీకరించినట్టు ఏడీఆర్ వెల్లడించింది. ఇక 2018-19లో రూ 1612 కోట్లు ఈ మార్గం ద్వారా వచ్చినట్టు బీజేపీ వెల్లడించింది. ఆ ఏడాది రాజకీయ పార్టీలకు వచ్చిన అజ్ఞాత నిధుల్లో (రూ 2512 కోట్లు) ఇవి 64 శాతం కావడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ రూ 728.88 కోట్లు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి నిధులను సమీకరించినట్టు పేర్కొంది. ఇక 2004-05 నుంచి 2018-19 వరకూ కాంగ్రెస్, ఎన్సీపీలు కూపన్ల అమ్మకం ద్వారా ఉమ్మడిగా ఆర్జించిన మొత్తం రూ 3902.63 కోట్లని ఏడీఆర్ పేర్కొంది. తమకు అజ్ఞాత వ్యక్తులు, గుర్తుతెలియని సంస్థల నుంచి రూ.1612.04కోట్ల విరాళాలు వచ్చాయని అధికార బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రూ.728.88 కోట్ల విరాళాల్లో 29 శాతం అజ్ఞాత వ్యక్తులు, గుర్తుతెలియని సంస్థల నుంచి వచ్చాయి. కాంగ్రెస్, ఎన్సీపీలు కూపన్ల విక్రయాల ద్వారా రూ.3,902.63 కోట్ల విరాళాలు వచ్చాయని ప్రకటించాయి. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ తమకు స్వచ్ఛందంగా ఎలాంటి విరాళాలు రాలేదని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో సహా అయిదు జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలతో పోలిస్తే (రూ. 900.94 కోట్లు) బీజేపీకి 1.5 రెట్ల అధికంగా అజ్ఞాత మార్గాల నుంచి విరాళాలు రావడం గమనార్హం

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
10 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
15 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
11 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
15 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
14 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
18 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
17 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
20 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
16 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
21 hours ago
ఇంకా