అక్కడ మాస్కు లేకపోతే లక్ష జరిమానా.. జైలు శిక్షే
23-07-202023-07-2020 18:38:31 IST
Updated On 24-07-2020 07:08:30 ISTUpdated On 24-07-20202020-07-23T13:08:31.539Z23-07-2020 2020-07-23T13:07:51.240Z - 2020-07-24T01:38:30.969Z - 24-07-2020

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయినా ప్రజల్లో ఇంకా నిర్లక్ష్యం తగ్గలేదు. 12 లక్షల కేసులు దాటిపోయాయి. 30 వేలకు పైగా మరణాలు సంభవించాయి. లాక్ డౌన్ విధించినా పరిస్థితిలో అంతగా మార్పులు రాలేదు. ఇంకా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే వున్నాయి. తాజాగా కరోనా నివారణకు జార్ఖండ్ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ మూవీ తరహాలో భారీ జరిమానాలకు రంగం సిద్ధం చేసింది. అది కూడా మామూలు జరిమానాలు కాదు. జార్ఖండ్ లో మాస్కు ధరించకపోతే లక్ష రూపాయల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని ప్రకటించి షాకిచ్చింది. జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమిది. జార్ఖండ్ ప్రభుత్వం గురువారంలక్ష రూపాయల జరిమానా ప్రకటించిన విషయం తెలిసి ఆ రాష్ట్ర వాసులతో పాటు యావత్ దేశం విస్తుపోతోంది. ఈ మహమ్మారి పంజా విసురుతున్న వేళ వైరస్ కట్టడికి ఈ స్థాయిలో ఫైన్ ఉండాల్సిందేనని పలువురు సమర్ధిస్తున్నారు. ప్రజల్లో కొవిడ్-19 పట్ల భయం ఉండాలని, లేకుంటే మన పరిస్థితి అమెరికాలో తయారవుతుందని భయపడుతున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం బుధవారం అత్యవసరంగా ‘ఇన్ఫెక్షియస్ డిసీస్ ఆర్డినెన్స్ -2020’ని తీసుకొచ్చింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగినా, ఇతర కరోనా నిబంధనలను ఉల్లంఘించినా రూ. లక్ష జరిమానా విధించాలని ఆర్డినెన్స్లో పేర్కొంది. అంతేకాదు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధిస్తారు. జార్ఖండ్ క్యాబినెట్ ఈ ఆర్డినెన్స్కు బుధవారం ఆమోదం తెలిపింది.దీంతో ఉల్లంఘనులకు షాక్ తప్పదన్నమాట. జార్ఖండ్లో ఇప్పటివరకు 6,682 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,048 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,570 కేసులు ఉన్నట్లు జార్ఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల కొరతతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులు, బాంకెట్ హాళ్లను ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనావాసాల మధ్య ఉన్న ప్రభుత్వ భవనాల్లోనూ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. గతంలో పది, ఇరవై, యాభై కేసులు నమోదయితే ప్రస్తుతం అవి రోజుకి 400 దాటాయి. జార్ఖండ్ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
13 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
14 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
14 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
17 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
19 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
17 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
19 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
15 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
21 hours ago
ఇంకా