గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ ... ఏం జరగబోతోంది?
27-07-202027-07-2020 10:19:36 IST
Updated On 27-07-2020 10:37:03 ISTUpdated On 27-07-20202020-07-27T04:49:36.681Z27-07-2020 2020-07-27T04:49:17.257Z - 2020-07-27T05:07:03.784Z - 27-07-2020

ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే వుంటాయి. ఏపీ రాజధాని విభజనకు సంబంధించిన బిల్లులపైన నేడు గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. మూడురాజధానులు, ఏపీ సీఆర్డీయే రద్దు బిల్లులు ఎప్పుడో రాజ్ భవన్ కు చేరాయి. ఇప్పటికే గవర్నర్ న్యాయ సలహా అడిగారు. న్యాయ సలహా కూడా ప్రభుత్వ న్యాయ విభాగం నుంచి వచ్చిన నేపథ్యంలో ఇకపై గవర్నర్ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ నిర్ణయం ఎలా ఉండబోతోంది. గవర్నరే నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిప్రాయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఏపీ, తెలంగాణ విడిపోయిన సందర్భంలో ఏపీకి ఒకటే రాజధాని ఉండాలని చట్టంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మూడు రాజధానులుగా విభజన చేస్తున్నందున ఇది చట్టపరంగా ఇబ్బందులు ఉంటాయా అనే అంశంపై కేంద్ర అభిప్రాయాన్ని గవర్నర్ తీసుకునే అవకాశం ఉండవచ్చు. అలా తీసుకోవాలని చాలా మంది గవర్నర్ను కోరిన నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం ఏ మేరకు ఉంటుంది అనేది ఆసక్తి రేపుతోంది.విపక్షాలు మాత్రం వీటిని ఆమోదించవద్దని గవర్నర్ బిబి హరిచందన్ ను కోరుతున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ విషయంలో వివాదాలు రాకుండా ఉండేలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సర్కారుకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతోన్న నేపథ్యంలో దీనికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. వికేంద్రీకరణ బిల్లు.. ఏపీ పునర్విభజన చట్టం-2014తో ముడిపడి ఉంది. దీంతో ఈ విషయంలో ఎలా ముందుకు వెళితే బాగుంటుందనే అంశంపై గవర్నర్ న్యాయసలహాలు తీసుకుంటున్నారు. గురువారం, శుక్రవారాల్లో పలువురు న్యాయకోవిదులు, సీనియర్ న్యాయవాదుల అభిప్రాయాలను రాజ్ భవన్ అధికారులు అడిగి తెలుసుకున్నట్లు వెల్లడైంది. సంప్రదింపుల అనంతరం రెండు రోజుల్లో బిల్లులపై గవర్నర్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. శాసనమండలి సెలెక్ట్ కమిటీకి వెళ్లాల్సిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని ప్రతిపక్షం టీడీపీ వాదిస్తోంది. మూడురాజధానుల బిల్లులు, సీఆర్డీయే రద్దుబిల్లులు రాజ్ భవన్ కు పంపారు. ఈ బిల్లులు మరోసారి న్యాయశాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో పరిశీలన అనంతరం తిరిగి గవర్నర్ చెంతకే చేరాయి. ఈలోపే ఈ బిల్లులపై ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీయడంతో, తర్వాత ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, రాష్ట ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం విషయంలో గవర్నర్,కోర్టుల ఆదేశాలను పట్టించుకోకపోవడంపై జగన్ సర్కారకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం ఎలా వుంటుందనేది అటు ప్రతిపక్షం, ఇటు అధికారపక్షాన్ని టెన్షన్ పెడుతోంది.

గోధుమల ఎగుమతులపై నిషేధం ..!
14-05-2022

టీఆర్ఎస్ సర్కారుపై గోవా సిఎం ప్రమోద్ సావంత్ విమర్శలు
13-05-2022

నేడు కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
13-05-2022

నిరాధార ఆరోపణలు చేసన బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ హెచ్చరిక
13-05-2022

ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
13-05-2022

గడపగడపకూ మంత్రి, ఎమ్మెల్యే ఖచ్చితంగా వెళ్లాల్సిందే
12-05-2022

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
12-05-2022

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం
12-05-2022

ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ గెలుపు!
11-05-2022

ఉక్రెయిన్కి 4,000 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న అమెరికా
11-05-2022
ఇంకా