మరో నాలుగేళ్లు ఫేస్ బుక్ లోనే ‘ఐసీసీ’ మ్యాచ్ ల విశేషాలు
28-09-201928-09-2019 12:48:23 IST
Updated On 28-09-2019 16:40:28 ISTUpdated On 28-09-20192019-09-28T07:18:23.108Z28-09-2019 2019-09-28T07:18:19.420Z - 2019-09-28T11:10:28.050Z - 28-09-2019

ఫేస్ బుక్ - ఐసీసీ డిజిటల్ ఒప్పందం మరో నాలుగేళ్లు కొనసాగనుంది. రాబోయే నాలుగేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే 12 ప్రధాన టోర్నీలకు సంబంధించిన డిజిటల్ హక్కులను ఫేస్బుక్ మరోసారి సొంతం చేసుకుంది. 2019 నుంచి 2023 వరకు నిర్వహించే అన్ని మెగా ఈవెంట్లు ఈ ఒప్పందం కిందకు వస్తాయి. 2020, 2021 టీ20 ప్రపంచకప్లు, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్, టీ 20 ప్రపంచ కప్ అర్హత పోటీలతో పాటు 2020, 2022లో జరిగే అండర్ 19 ప్రపంచకప్ మ్యాచ్ ల డిజిటల్ హక్కులు ఫేస్ బుక్ కు దక్కాయి. డిజిటల్ హక్కలు అంటే.. ఐసీసీ ఈవెంట్ లో భాగంగా నిర్వహించే మ్యాచ్ ల అనంతరం ప్రసారం చేసే రీక్యాప్స్, ఆ రోజు ఆటలోని విశేషాలతో రూపొందించిన వీడియోలను ఫేస్ బుక్ ప్రసారం చేస్తారు. దీంతోపాటు ఇతర ముఖ్యమైన వీడియోలను ఫేస్బుక్ ప్రసారం చేస్తుంది. ‘‘ఫేస్బుక్తో మరోసారి భాగస్వామ్యం కావడం ఆనందదాయకం. క్రికెట్ అభిమానులకు డిజిటల్ రూపంలో మరింత చేరువవ్వడానికి ఈ విధంగా ముందుకొచ్చాం. ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులను అలరించడానికి ఫేస్బుక్తో భాగస్వామ్యమయ్యాం’’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సావ్నే తెలిపారు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్ డిజిటల్ మీడియాలో మంచి స్పందన లభించింది. మొత్తం డిజిటల్ వ్యూయర్ల సంఖ్య 4.6 బిలియన్లుగా నమోదైంది. అందులో ఫేస్బుక్ ద్వారానే 1.2 బిలియన్ల నిమిషాల వీడియోలను అభిమానులు వీక్షించారు. ఈ నేపథ్యంలో మార్కెట్ను మరింత విస్తరించుకోవడంతో పాటు క్రికెట్ అభిమానులకు ఎక్కువగా చేరువవ్వడానికి సామాజిక మాధ్యమాల ద్వారా మరింత ఎక్కువగా చేరువవ్వడానికి ఐసీసీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఫేస్ బుక్ తో ఒప్పందాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
5 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా