భారత్లో ఆపిల్ సొంత దుకాణం.. ఐ ఫోన్ ప్రియులకు ఊరట
28-02-202028-02-2020 15:09:31 IST
2020-02-28T09:39:31.956Z28-02-2020 2020-02-28T09:39:27.340Z - - 12-04-2021

భారతీయ వినియోగదారులకు ప్రపంచ సాంకేతిక దిగ్గజాల్లో ఒకటైన ఆపిల్ శుభవార్త చెప్పింది. భారతీయ వినియోగదారులకు నేరుగా ఆన్లైన్లోనే ఐఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఆపిల్ తన ఉత్పత్తులను భారత్లో థర్డ్పార్టీ రీటైలర్ల ద్వారా ఐఫోన్లను విక్రయిస్తుండటం తెలిసిందే. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో తన సొంత ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించనున్నట్టు ధృవీకరించింది. 2021 నాటికి భారతదేశంలో తొలి ఆపిల్ బ్రాండెడ్ ఫిజికల్ స్టోర్ ఏర్పాటు కానుందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా ప్రకటించారు. కాలిఫోర్నియాలో జరిగిన సంస్థ వార్షిక వాటాదారుల సమావేశంలో ఈ విషయాన్ని టిమ్ కుక్ వెల్లడించారు. దేశీయ భాగస్వామితో కాకుండా తామే స్వయంగా స్టోర్ను ప్రారంభించాలని చూస్తున్నామని, దీనికి సంబంధించిన అనుమతులను భారత ప్రభుత్వం నుండి పొందాల్సి వుందని కుక్ చెప్పారు. తమ బ్రాండ్ను మరెవరో నడపాలని తాను కోరుకోవడంలేదన్నారు. తమకు భారత్ చాలా కీలకమైన మార్కెట్ అని గట్టిగా విశ్వసించే కుక్ 2020 జూన్, జూలై మధ్య ఇండియాలో పర్యటించనున్నారు. భారత్లో వ్యాపారం, తయారీ ప్రణాళికలు, ఎగుమతులు, ఆన్లైన్, ఆఫ్లైన్ ఆపిల్ దుకాణాల విస్తరణతో సహా పలు అంశాలను ఆయన పరిశీలించనున్నారు. 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల సడలింపుల నేపథ్యంలో 2020 జనవరి, మార్చి మధ్య ఆపిల్ తన మొదటి ఆన్లైన్ స్టోర్ను ముంబైలో ప్రారంభించనుందని అంచనాలొచ్చాయి. అయితే లాజిస్టికల్ సమస్యలతో ఈ ప్రయత్నాలను వాయిదా వేసినట్టు పలు అంచనాలు వెలువడ్డాయి. గత డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఆపిల్ భారతదేశంలో 925,000 ఐఫోన్లను రవాణా చేసిందని పరిశోధనా సంస్థ కెనాలిస్ అంచనా. ఈ సంఖ్య ఒక సంవత్సరంలో దాదాపు 200 శాతం పెరిగింది. అయితే దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై కేంద్రం విధించిన భారీ దిగుమతి సుంకం ఆపిల్కు భారతీయ స్మార్ట్మార్కెట్లో పెద్ద సవాలు. ఈ నేపథ్యంలోనే ఆపిల్ కాంట్రాక్టర్లు ఫాక్స్కాన్, విస్ట్రాన్ సహకారంతో ఐఫోన్లు అసెంబ్లింగ్ ద్వారా పలు రకాల ఐఫోన్ మోడళ్లను (ప్రస్తుత తరం శ్రేణి మినహా) తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో సొంత దుకాణాలను ప్రారంభించే ముందు సబ్సిడీ, దిగుమతి సుంకాల సడలింపుపై భారత ప్రభుత్వంతో గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా