‘నెట్’ఇంట్లోనే గడిపేస్తున్నారు!
07-03-201907-03-2019 14:54:33 IST
Updated On 07-03-2019 14:56:32 ISTUpdated On 07-03-20192019-03-07T09:24:33.737Z07-03-2019 2019-03-07T09:23:47.641Z - 2019-03-07T09:26:32.218Z - 07-03-2019

ప్రపంచవ్యాప్తంగా సమాచార సాంకేతిక విప్లవం ప్రజల జీవితాలను బాగా ప్రభావితం చేస్తోంది. డేటా భారం తగ్గడంతో ఇండియాలోనూ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య రెండంకెల వృద్ధితో 63 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఐఎమ్ఆర్బీ సంస్థ వెల్లడించింది. గ్రామాల్లో ఇంటర్నెట్ వృద్ధి జోరుగా ఉందని, దీంతో నెట్ వాడకందారుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఈ సంస్థ తన తాజా ఐక్యూబ్ 2018 నివేదికలో పేర్కొంది.
ఇంటర్నెట్ కోసం దాదాపు 97 శాతం మంది మొబైల్ ఫోన్లనే వినియోగిస్తున్నారని, మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో మహిళల సంఖ్య 42 శాతంగా ఉంది. అంతేకాదు దేశంలోని జనాభా కంటే ఫోన్ల సంఖ్యే ఎక్కువని తెలిపింది. సరాసరి ప్రతి వినియోగదారుడి దగ్గర ఒక బేసిక్ ఫోన్, అత్యాధునిక స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉందని, లేటెస్ట్ మోడల్ ఫోన్లను బాగా కొనుగోలు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.
2018తో పోలిస్తే దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 18శాతం వృద్ధి నమోదుచేసుకుంది. తొలిసారిగా నెటిజన్ల సంఖ్య 50 కోట్లు దాటేసింది. పల్లెల్లో ఇంటర్నెట్ వృద్ధి, వినియోగం జోరుగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అతి తక్కువ రేటుకి వోల్ట్, 4జీ ఫీచర్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ను వినియోగిస్తున్న వారిలో 87శాతం మంది రెగ్యులర్ వినియోగదారులే. వీరంతా కనీసం నెలకు ఒక్కసారైనా నెట్ వాడుతున్నారు.
రీఛార్జి చేసుకుంటున్నారు. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 29 కోట్ల మంది పట్టణ ప్రాంతాల వారు కాగా, 25 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారు కావడం గమనించాల్సిన అంశం. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గత ఏడాదిలో పట్టణ ప్రాంతాల్లో 7 శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అనూహ్యంగా 35 శాతం పెరగడం దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరగడానికి కారణం అయింది. 2018లో గ్రామీణ ప్రాంతాల్లో 25 కోట్ల మేర ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 30 కోట్ల వరకూ చేరవచ్చు అని అంచనా. మొత్తం మీద దేశ జనాభాలో సగం మంది ఇంటర్నెట్ వాడడం ఆయా కంపెనీలకు లాభాల పంట పండిస్తోంది.

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
3 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా