దంపతుల మధ్య పెరిగిన రొమాన్స్.. వాటికి భారీ డిమాండ్
28-03-202028-03-2020 19:14:53 IST
2020-03-28T13:44:53.035Z28-03-2020 2020-03-28T13:40:09.208Z - - 10-04-2021

స్వీయ నిర్బంధం కారణంగా దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దంపతుల్ని బాగా కలిపేస్తోంది. ఇంతకుముందు మార్నింగ్ డ్యూటీలో భార్య.. నైట్ డ్యూటీలో భర్త ఉండేవారు. కరోనా వైరస్ వల్ల వాళ్ళ డ్యూటీలు మారిపోయాయి. ఇద్దరూ వర్క్ ఫ్రం హోంతో ఇంట్లోనే వుంటున్నారు. తమకు నచ్చిన పనులు చేస్తున్నారు. తమకు ఖాళీ సమయాన్ని రొమాన్స్ కోసం కేటాయిస్తున్నారు. పిల్లలు లేని దంపతులు, పని వత్తిడి కారణంగా పిల్లల గురించి గతంలో ఆలోచించని వారు ఇప్పుడు పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు లేకుండా కారణంగా గర్భనిరోధక పిల్స్ వాడుతున్నారు. అలాగే కండోమ్ ల వాడకం భారీగా పెరిగింది. మెడికల్ షాపుల్లో వివిధ రకాల మందులతో పాటు కండోమ్స్ కూడా విధిగా తీసుకుంటున్నట్టు సర్వేలో తేలింది. జనవరి నుంచి ఇప్పటివరకూ కండోమ్స్ వాడకం 200 శాతం పెరిగింది. అమెరికా, కెనడా, సౌత్ కొరియా లాంటి దేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కండోమ్ల ఉత్పత్తి కూడా తగ్గిందని తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కండోమ్లను ఉత్పత్తి చేసే కేరెక్స్ బెర్హాద్ సంస్థ దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. మలేషియాకు చెందిన ఈ కంపెనీ గత వారం నుంచి ఒక్క కండోమ్ను కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. ఆ కంపెనీకి మలేషియాలో మూడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అయిదుగురిలో ఒకరు వినియోగించేది ఆ కంపెనీ కండోమే. లాక్డౌన్ నేపథ్యంలో ఆంక్షలు కఠినంగా ఉన్నాయి. దీంతో కండోమ్ల ఉత్పత్తి ఆగిపోయిందని సంస్థ తెలిపింది. ఇప్పటికే వంద మిలియన్ల కండోమ్ల కొరత ఉందని, డిస్ట్రిబ్యూటర్ల నుంచి తరచూ తమకు వత్తిడి వస్తోందని సంస్థ వెల్లడించింది. డ్యూరెక్స్ లాంటి మేటి బ్రాండ్ కండోమ్లను ఈ సంస్థనే ఉత్పత్తి చేస్తుంది. బ్రిటన్కు చెందిన ఎన్హెచ్ఎస్తో పాటు ఐక్యరాజ్యసమితి చేపట్టే అనేక కార్యక్రమాలకు ఈ కంపెనీ కండోమ్లను పంపిణీ చేస్తుంది. కండోమ్ల ఉత్పత్తికి అనుమతి లభించింది. అయితే ఉద్యోగుల కొరత కారణంగా 50 శాతం మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని పేర్కొంది. మలేషియాలో ఇప్పటి వరకు మూడు వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 26 మంది మరణించారు. పిల్లలు కావాలనుకునేవారు.. వైరస్ ప్రబలుతున్న సమయంలో.. తమ ప్రెగ్నెన్సీ ప్లాన్స్ను వాయిదా వేసుకోవాలని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీంతో వీటి వాడకం పెరిగిపోయింది. అంతేకాదు దంపతులు ఇద్దరూ యూట్యూబ్ వినియోగం పెంచేస్తున్నారు. తమకిష్టమయిన సినిమాలు చూడడం, రొమాంటిక్ సన్నివేశాలు చూడడం ఎక్కువైంది.

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
3 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా