టిక్ టాక్ అంబానీ స్వంతం కానుందా?
15-08-202015-08-2020 12:32:41 IST
Updated On 15-08-2020 13:18:54 ISTUpdated On 15-08-20202020-08-15T07:02:41.639Z15-08-2020 2020-08-15T07:01:58.778Z - 2020-08-15T07:48:54.098Z - 15-08-2020

ఇప్పుడు ఎక్కడ చూసినా టిక్ టాక్ గురించే చర్చ సాగుతోంది. టిక్ టాక్ పై భారత్ నిషేధం విధించింది. అమెరికా అధ్యక్షుడు కూడా 45 రోజుల గడువిచ్చారు. దీంతో ఈ టిక్ టాక్ వీడియో మెసేజింగ్ యాప్ ని స్వంతం చేసుకునేందుకు అమెరికాకి చెందిన మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ పోటీపడుతున్నాయి. టిక్ టాక్ యాజమాన్య ప్రతిపాదనపై రిలయన్స్ అధినేత అంబానీ సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చైనా పై ప్రతీకార చర్యలో భాగంగా ఇండియా .. డిజిటల్ బ్యాన్ పై దృష్టి పెట్టి చైనా కి చెందిన దాదాపు 100 కి పైగా యాప్స్ ను ఇప్పటివరకు నిషేధించింది. టిక్ టాక్ మళ్లీ ఇండియాలో పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈతరుణంలో టిక్ టాక్ గురించి మరో సంచలన వార్త మార్కెట్లో హల్ చల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల పెట్టుబడులతో దూసుకుపోతున్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టిక్ టాక్ ను కోనుగోలు చేయనుందన్న అంచనా ఆసక్తికరంగా మారింది. టిక్ టాక్ యజమాన్య సంస్థ బైట్ డాన్స్ తో ప్రారంభ దశ చర్చలు జరుపుతోంది. టిక్ టాక్ కి సంబంధించి ఇండియా వ్యాపారాన్ని మొత్తం రిలయన్స్ కు విక్రయించేందుకు బైట్ డాన్స్ రెడీ అవుతోంది. త్వరలో ఈ డీల్ తుదిదశకు చేరనుంది. ఇందులో భాగంగా టిక్ టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ మేయర్ ఆర్ ఐ ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించినట్లు తెలుస్తోంది. టిక్ టాక్ కి సంబంధించి ఇండియా వ్యాపారాన్ని మొత్తం రిలయన్స్ కు విక్రయించడం ద్వారా ఇండియాలో పాగా వేయాలని భావిస్తోంది. ప్రధాని మోడీకి, అంబానీకి మంచి సంబంధాలు వున్నాయి. దీంతో కేంద్రం కూడా టిక్ టాక్ విక్రయానికి అంగీకారం తెలపవచ్చని అంటున్నారు. సెప్టెంబర్ 15 గడువుకు ముందే టిక్ టాక్ లోవాటా కొనుగోలుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చల నేపథ్యంలో అంబానీ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా