రాణించని బ్యాట్స్మెన్లు.. తొలిరోజు కివీదే..
29-02-202029-02-2020 16:35:45 IST
Updated On 29-02-2020 16:39:29 ISTUpdated On 29-02-20202020-02-29T11:05:45.194Z29-02-2020 2020-02-29T11:05:42.968Z - 2020-02-29T11:09:29.489Z - 29-02-2020

భారత్తో క్రైస్ట్చర్చ్ వేదికగా శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో కివీస్ తన హవాను కొనసాగిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను 242 పరుగులకే ఆలౌట్ చేసిన న్యూజిలాండ్.. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ లాథమ్(27 బ్యాటింగ్), టామ్ బ్లండెల్( 29 బ్యాటింగ్)లు క్రీజ్లో ఉన్నారు. మొదటి రోజు ఆటలో భారత్ 23 ఓవర్ల పాటు బౌలింగ్ వేసినా వికెట్ను కూడా సాధించలేకపోయింది. దాంతో ప్రస్తుతానికి న్యూజిలాండ్దే పైచేయిగా కనబడుతోంది. న్యూజిలాండ్ ఇంకా 179 పరుగులు తొలి ఇన్నింగ్స్లో వెనకబడి ఉంది. రెండో రోజు భారత బౌలర్లు పుంజుకుని కివీస్ను త్వరగా ఆలౌట్ చేయకుంటే భారత్కు కష్టాలు తప్పవు. అంతకముందు.. పృధ్వీషా(54), పుజరా(54), హనుమ విహారి(55) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 242 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు.. ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. ఇద్దరూ పరుగులు ఆచితూచి ఆడారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద మయాంక్(7).. బౌల్ట్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరగడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. నయావాల్ పుజారాతో జతకలిసిన ఓపెనర్ పృధ్వీ(54) షా చెలరేగి ఆడాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన ఈ యువ ఆటగాడు 8 పోర్లు సాయంతో 54 పరుగులు చేసాడు. జట్టు స్కోర్ 80 పరుగుల వద్ద జేమిసన్ బౌలింగ్లో టామ్ లాథమ్కు క్యాచ్ ఔటైయ్యాడు. అనంతరం పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ(5)తో కలిసి పుజరా(54) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో టీమిండియా 85/2తో లంచ్కు వెళ్లింది. భోజన విరామం అనంతరం విరాట్ కోహ్లి తన పేలవ ఫామ్ను కొనసాగిస్తూ.. సౌతీ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వెస్కెప్టెన్ రహానే 7 పరుగులే చేసి ఔటవ్వడంతో 113 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. టీ విరామం తరువాత టీమిండియా తడబడింది. జేమిసన్ ధాటికి వరుస వికెట్లు కోల్పోయింది. పుజారా ఔటైన తర్వాత రెండు బౌండరీలతో మెరుపులు మెరిపించిన పంత్(12) కూడా జెమీసన్ బౌలింగ్లోనే ఔటైయ్యాడు. ఆ తర్వాత ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించలేదు. రవీంద్ర జడేజా(9), ఉమేష్ యాదవ్(0), మహ్మద్ షమి(16) ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో టీమిండియా 63 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ 45 పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లను కోల్పోవడం గమనార్హం. కివీస్ బౌలర్లలో జెమీసన్ 5 వికెట్లతో సత్తాచాటగా.. టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్లు తలా రెండు వికెట్లు, నీల్ వాగ్నర్ ఒక వికెట్ పడగొట్టారు.

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్ల ప్రశంసల జల్లు
13 hours ago

కోహ్లీ జాగ్రత్త..!
15 hours ago

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
21 hours ago

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021

ముంబై ఇండియన్స్ శిబిరంలో కరోనా కలకలం
07-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
06-04-2021

ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్ని దెబ్బతీస్తుందనుకున్నా... పుజారా
05-04-2021
ఇంకా