ఇక సాగదీయకు ధోనీ.. గౌరవంగా రిటైర్ అయిపో.. షోయబ్ హితవు
13-04-202013-04-2020 14:27:22 IST
Updated On 13-04-2020 14:38:38 ISTUpdated On 13-04-20202020-04-13T08:57:22.690Z13-04-2020 2020-04-13T08:57:20.996Z - 2020-04-13T09:08:38.722Z - 13-04-2020

అటు క్రికెట్ మైదానంలోకి రాకుండా, ఇటు రిటైర్మెంట్ విషయంలో ఏదీ తేల్చకుండా ఎన్నాల్లు సాగదీస్తావ్ ధోనీ.. ఆటకు ఇకనైనా గౌరవంతో వీడ్కోలు పలికితే మంచిది అంటూ పాకిస్తాన్ మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్ ఉన్నట్లుంది బాంబు పేల్చాడు. భారత క్రికెటర్ల గురించి, భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ పోటీల గురించి అలుపన్నదే లేకుండా అభిప్రాయాలు చెబుతున్న పాక్ స్పీడ్ స్టర్ ఉన్నట్లుండి ధోనీపై పడ్డాడు. ఇటీవలే కరోనాపై పోరాటానికి నిధుల సమీకరణ కోసం భారత్, పాక్ మధ్య మ్యాచ్లు నిర్వహించాలని చెప్పిన అక్తర్ పలువురి ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై స్పందించాడు. ఈ అంశాన్ని ధోనీ ఎక్కువకాలం సాగదీయకుండా ఉంటే బాగుంటుందని అక్తర్ తెలిపాడు. 'ధోనీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి భారత క్రికెట్కు సేవలు అందించాడు. ఇక ఆటకు గౌరవంతో వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేసింది. అయితే ధోనీ ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు సాగదీస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాతే అతడు రిటైరవ్వాల్సింది. ఒకవేళ నేను అతడి స్థానంలో ఉంటే అప్పుడే ఆటకు వీడ్కోలు పలికేవాడిని. 2011 ప్రపంచకప్ తర్వాత ఇక ఆడకూడదరి నిర్ణయించుకొని నేను క్రికట్కు వీడ్కోలు పలికాను. ఆ తర్వాత ఎప్పుడు బ్యాట్ పట్టలేదు. కానీ ఇండియాకు రెండు ప్రపంచకప్లు అందించడంలో కీలక పాత్ర పోషించిన ధోనికి వారి దేశం ఎంతో గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఐపీఎల్ 2020 జరిగి ఉంటే.. అందులో ధోని మంచి ప్రదర్శన కనబరిచి ఉంటే కచ్చితంగా టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండేవాడు. నా దృష్టిలో 2019 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్తోనే ధోని ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అయితే ప్రపంచకప్ తర్వాతనైనా.. వీడ్కోలు సిరీస్ ఆడి, గౌరవంగా తప్పుకోవాల్సింది అంటూ షోయబ్ తన వంతుగా ధోనీ నిష్క్రమణ తప్పదని చెప్పేశాడు. కాగా, భారత్ మామూలు టోర్నీల్లో అదరగొడుతూ ప్రపంచ కప్ వంటి కీలక టోర్నీల్లో చతికిలపడుతుండటానికి కారణం మిడిలార్డర్లో ఫినిషర్స్ కొరత ప్రభావమేనని అక్తర్ తేల్చి చెప్పేశాడు. ఇక మాములు సిరీస్ల్లో అదరగొడుతున్న కోహ్లీ సేన.. ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవకపోవడానికి మిడిలార్డర్లో మ్యాచ్ విన్నర్స్ లేకపోవడమే కారణం. టోర్నీ విజేతలుగా నిలవడం ఒక విషయమైతే.. అగ్ర జట్టుగా కొనసాగడం మరో విషయం. టెస్ట్ల్లో భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది. పరిమిత ఓవర్లలో కూడా టాప్ టీమ్స్లో ఒకటిగా ఉంది అని షోయబ్ చెప్పాడు. కేవలం ఐసీసీ ఈవెంట్ల ఫలితాల ఆదారంగా వారి ప్రదర్శనపై ఓ అంచనాకు రాకుడదు. అదే సమయంలో ఐసీసీ ఈవెంట్స్ కూడా వారు గెలవాల్సిందే. టాప్-4 చెలరేగితో ఆ జట్టుకు తిరుగుండదు. కానీ ఎప్పుడో ఒకసారి విఫలమైతే మాత్రం ఫలితం వేరేలా ఉంటుంది. వారి సమస్యే అదే. అలాగే ధోనీ, యువరాజ్ సింగ్ వంటి ఫినిషర్స్ మిడిలార్డర్లో ఉంటే.. ఫలితం వేరేలా ఉంటుంది. సమస్యంతా మిడిలార్డర్లో ఫినిషర్స్ కొరత వల్లే ' అంటూ అక్తర్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుత కరోనా బీభత్సం ఇలాగే కొనసాగితే మరో 6-8 నెలలు ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు ఉండవన్నాడు. ఇక టీ20 వరల్డ్ కప్ కూడా జరిగే అవకాశం లేదని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?
15 hours ago

భారీ లక్ష్యమైనా.. చితక్కొట్టిన ఢిల్లీ
a day ago

IPL 2021: వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగుళూర్
18-04-2021

సన్ రైజర్స్.. మరో 'సారీ'..!
18-04-2021

MI vs SRH: కొండను ఢీకొట్టబోతున్న సన్ రైజర్స్
17-04-2021

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
16-04-2021

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021
ఇంకా